News

ఈ ఫోటో చూసి నాసానే షాక్


ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నోట్లరద్దు తర్వాత ప్రభుత్వ ఆదాయం తగ్గుదలపై నెలాఖరులో స్పష్టత వస్తుందని, ఇబ్బందులున్నా ఉద్యోగులకు జీతాలు ఇస్తామని ఏపీస్పష్టం చేశారు. నోట్లరద్దు నిర్ణయాన్ని ఏ పార్టీ వ్యతిరేకించలేదని, లోపాలను సరిచేయాలని అన్ని పార్టీలు కోరుతున్నాయని అన్నారు. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రాపై ఆంక్షలు సరికాదని తెలిపారు. మరోవైపు అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణంపై మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరుకల్లా భవనం పూర్తి అవుతుందని తెలిపారు. జనవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల పెన్షన్లు బ్యాంకుల్లో జమ చేస్తామన్న యనమల వృద్ధులకు మాత్రమే నగదు రూపంలో చెల్లిస్తామని తెలిపారు.